ETV Bharat / state

వైకుంఠ ఏకాదశి రోజున తరించిన భక్తజనం

author img

By

Published : Dec 25, 2020, 6:56 PM IST

Vaikuntha Ekadashi celebrations in Narayanpet district
వైకుంఠ ఏకాదశి రోజున తరించిన భక్తజనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా నారాయణపేట జిల్లాలోని పలు ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో నిండిపోయాయి. వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు వరుసలు కట్టారు. దీప, ధూప నైవేద్యాలతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు.

స్వామివారి దర్శించుకునేందుకు ఆలయ ఆధికారులు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, విష్ణు సహస్రనామార్చనలతో భక్తులు తరించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి: ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.