ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Nov 9, 2020, 4:12 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

నారాయణ పేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ప్రారంభించారు. మక్తల్, మాగనూరు, కృష్ణటై రోడ్, నర్వ మండలాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి సూచించారు. నారాయణ పేట జిల్లాలోని మక్తల్​, మాగనూరు, కృష్ణటై రోడ్డు, నర్వ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.1,888, సాధారణ రకం క్వింటాకు రూ.1,868కు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మక్తల్ మార్కెట్ యార్డు వద్ద నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వే బ్రిడ్జ్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ వనజ, మార్కెట్ ఛైర్మన్​ రాజేష్ గౌడ్, జడ్పీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.