నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోవటం వల్ల నీరంతా దిగువకు వృథాగా వెళ్లిపోతోంది. హైదరాబాద్ నుంచి సాఫ్ట్ లాగ్ గేట్లు ఇంకా చేరుకోకపోవటంతో కొత్తగేటు పునరుద్ధరణ పనులు ప్రారంభం కాలేదు. కొట్టుకుపోయిన గేటు నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 4200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో ఆ మాత్రం నీరు నిల్వ ఉంది... లేదంటే డ్యాంలో చుక్క నీరు ఉండేది కాదని స్థానికులు వెల్లడించారు.
ఇదీ చూడండి: పిడుగుపాటుకు దంపతుల దుర్మరణం