ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరగడం వల్ల జలాశయం 4 గేట్లు ఎత్తి 2600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1850 క్యూసెక్కులుగా ఉంది. మొదట రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో పెరగటం వల్ల నాలుగు గేట్లు ఎత్తారు.
ఇవీ చూడండి: మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ