ETV Bharat / state

రూ.లక్ష లంచం తీసుకుంది.. రెడ్​హ్యాండెడ్​గా అనిశాకు పట్టుబడింది..!

author img

By

Published : Feb 25, 2020, 5:06 PM IST

Updated : Feb 26, 2020, 9:30 AM IST

Revenue officer in acb trap
పట్టా మార్పిడి కావాలా.. కొట్టు రూ. 10 లక్షలు

ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి.. వేలల్లో జీతం, హోదా అయినా సంతృప్తి చెందని సదరు అధికారిణి తన పరిధిలో లేని పని కూడా చేస్తానంటూ ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసింది. అడ్డంగా అనిశాకు దొరికిపోయింది.

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కింది ఓ అవినీతి తిమింగలం. నాగర్​కర్నూల్ జిల్లా తాడూర్​ మండలం డిప్యూటీ తహసీల్దార్​గా విధులు నిర్వహిస్తున్న జయలక్ష్మి కలెక్ట​రేట్​లో సి-బ్లాక్​లో ఇంఛార్జి సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తోంది.

తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో వివాదంలో ఉన్న రెండు ఎకరాల 25 గుంటల భూమి పట్టా మార్పిడి కోసం ఓ రైతు నుంచి రూ. 13 లక్షలు డిమాండ్ చేసింది సదరు అవినీతి అధికారిణి. అంత సొమ్మును ఇచ్చుకోలేనన్న రైతు మాటలతో రూ. 10 లక్షలకు వాయిదాల పద్ధతిన లక్ష చొప్పున ఇచ్చేటట్లు బేరం కుదిరింది.

సోమవారం కలెక్టరేట్​లోని సీ-బ్లాక్​లో రూ. లక్ష రైతు వెంకటయ్య నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. కొసమెరుపు ఏంటంటే ఈమె పనిచేస్తున్న సీ- బ్లాక్ భూములకు ఈమె పరిధికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ తాను అన్ని పనులు చేస్తానని వెంకటయ్యను నమ్మించి అడ్డంగా దొరికిపోయింది.

ఉప తహసీల్దార్​పై కేసు నమోదు చేసి ఆమె ఇంట్లో కూడా సోదాలు చేస్తామని.. అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.

పట్టా మార్పిడి కావాలా.. కొట్టు రూ. 10 లక్షలు

ఇవీ చూడండి: 'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'

Last Updated :Feb 26, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.