ETV Bharat / state

10 ఏళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 5:19 PM IST

Updated : Nov 24, 2023, 7:56 PM IST

BRS Praja Ashirvada Sabha at Mulugu
CM KCR Public Meeting at Mulugu

CM KCR Public Meeting at Mulugu : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పదేళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ పార్టీల్లో ఎవరి పాలన బాగుందో చూసి ప్రజలు ఓటేయాలని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ సూచించారు. బీఆర్​ఎస్​ గెలిస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ పుంజుకుంటాయని.. అదే కాంగ్రెస్​కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడిపోతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్​ జిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

CM KCR Public Meeting at Mulugu : ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఇంకేమీ లేదని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​(CM KCR) అన్నారు. కాంగ్రెస్​ పాలనలో మంచినీళ్లు వచ్చాయా.. పోడు పట్టాలు ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని.. కాంగ్రెస్​ పార్టీపై విరుచుకుపడ్డారు.

తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులకు ఎన్నో సార్లు మొక్కానని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఎన్నికల్లో పార్టీల దృక్పథం చూసి ఓటేయాలని కోరారు. బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. రాష్ట్ర హక్కుల కోసమని అన్నారు. పదిహేనేళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లుగా బీఆర్​ఎస్(BRS)​ అధికారంలో ఉందని.. కానీ కాంగ్రెస్​ 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని పేర్కొన్నారు. అయితే ఎవరి పాలనలో ఎంత మేలు జరిగిందో పోల్చి చూడాలని ములుగు సభకు విచ్చేసిన ఓటర్లను కోరారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవు - మన దేశంలోనూ అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్

BRS Praja Ashirvada Sabha at Mulugu in Telangana : కంటి వెలుగు(Kanti Velugu) వంటి కార్యక్రమాన్ని ఎవరూ ఊపించలేదని.. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 80 లక్షల మందకి కళ్లద్దాలు పంపిణీ చేశామని వివరించారు. ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి కిందర రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. మిషన్​ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు ఇస్తున్నామని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని రేవంత్​రెడ్డి అంటున్నారని.. అలాగే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని మండిపడ్డారు.

"పోడు భూముల సమస్య కూడా ఇంచుమించు క్లియర్​ చేసుకున్నాం. నాకు తెలుసు కొంతమంది గిరిజనులు కాని వారికి కూడా పోడు భూముల ఉన్నాయి. వారి సమస్యకు పరిష్కారం కావాలని అడుగుతున్నారు. అది కేంద్రం చేతిలో ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా. తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వాళ్లకు కూడా పట్టాలు ఇప్పిస్తాం. ఎందుకంటే ములుగు నాది. తెలంగాణలో ఏ ఊరు, పల్లె ఎక్కడ బాగుపడిన కేసీఆర్​కు పేరే కదా." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

CM KCR About on Dharani Portal : ధరణి ఉండటం వల్ల రైతుబంధు డబ్బులు ఇవ్వగలుగుతున్నామని.. అదే ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం, లంచాల రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్​ హెచ్చరించారు. అయినా ఈ ధరణిని తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ పోర్టల్​ తీసేయడం వల్ల మళ్లీ వీఆర్​వో, ఆర్​ఐ, ఎమ్మార్వోలు వస్తారన్నారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు(Rythu Bandhu)లో సగం ఇవ్వమని అడుగుతారని చెప్పారు. నాటి కాంగ్రెస్​ పాలనలో మంచినీళ్లు వచ్చాయా.. పోడు భూములకు పట్టాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వాటి అన్నింటికీ పరిష్కారం చూపి.. సక్రమైన పాలనను అందిస్తున్నామని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు.

10 ఏళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి సీఎం కేసీఆర్​

గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్‌ నీళ్లు ఇవ్వలేకపోయింది : సీఎం కేసీఆర్​

జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్

Last Updated :Nov 24, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.