మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్లో నివాసముండే ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ విఫలమైందని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు.
బాలానగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ.. గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కాగా.. నిన్ను లవ్ చేస్తున్నాను అంటూ.. సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో ప్రవీణ్ యువతి పేరు రాయలేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.