ETV Bharat / state

అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్​ను సందర్శించిన సీపీ

author img

By

Published : May 15, 2021, 10:19 PM IST

అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్​ను సందర్శించిన సీపీ
అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్​ను సందర్శించిన సీపీ

లాక్​డౌన్ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్ కుమార్, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి-సిరొంచ అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ సందర్శించారు. చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి-సిరొంచ అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్​ను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్ కుమార్, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ సందర్శించారు. పాసులు ఉన్న వాహనాలు, మెడికల్ ఎమర్జెన్సీ, గూడ్స్ వాహనాలు అనుమతించాలని అక్కడున్న సిబ్బందిని సీపీ ఆదేశించారు.

ప్రజలు లాక్‌డౌన్​కు సహకరిస్తున్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు. సిరొంచ-చెన్నూర్ సరిహద్దులో రెవెన్యూ, హెల్త్, ఎక్సైజ్, పోలీసులతో కలిపి ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మూడు వేల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్‌ సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.