మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ సముదాయంలో రహదారులను ఆక్రమించిన నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి జేసీబీ సాయంతో కూల్చివేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించాలని సూచించారు.
అక్రమ నిర్మాణాల తొలగింపునకు వారం రోజుల గడువు ఇస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. లేదంటే జేసీబీలతో తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రజల అవసరాలు గుర్తించి.. దుకాణదారులు రోడ్లపై వేసిన రేకులు తీసివేయాలన్నారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ