ETV Bharat / state

ఏసీపీ ఆకస్మిక తనిఖీలు.. పలువురిపై కేసులు

author img

By

Published : May 19, 2021, 7:45 PM IST

MANCHIRYALA ACP AKHIL MAHAJAN INSPECTION AT INDANPALLLI CHECKPOST
MANCHIRYALA ACP AKHIL MAHAJAN INSPECTION AT INDANPALLLI CHECKPOST

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్​ పల్లి చెక్​పోస్ట్ వద్ద ఏసీపీ అఖిల్ మహాజన్​ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అనసవరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

లాక్​డౌన్ సమయంలో అనసవరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఏసీపీ అఖిల్​ మహాజన్ హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్​ పల్లి చెక్​పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సరైన కారణం లేకుండా బహిరంగంగా తిరుగుతున్న వారిని హెచ్చరించి.. కేసులు నమోదు చేశారు.

ఇవీ చూడండి: కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.