ETV Bharat / state

కరీంనగర్​లో మంత్రి కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం

author img

By

Published : Jul 21, 2020, 12:37 PM IST

Minister KTR visit to Karimnagar
కరీంనగర్​లో మంత్రి కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం

కరీంనగర్​ జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పర్యటించారు. మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

కరీంనగర్‌ పట్టణంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆరో విడత హరితహారంలో భాగంగా దిగువ మానేరు జలాశయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం శాతవాహన వర్సిటీలో మిషన్​ భగీరథ పథకం కింద రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించిన మెయిన్​ బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ను ప్రారంభించారు.

నగర ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకు రిజర్వాయర్​ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కేటీఆర్​ వివరించారు. కేవలం రెండు సంవత్సరాలలోనే జలాశయం పనులు పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్​, నగర మేయర్​ సునీల్​రావు, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్​లో మంత్రి కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం

ఇదీచూడండి: బాధ్యత మరిచి ఫోన్లలో నిమగ్నమై..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.