ETV Bharat / state

కొవిడ్ కలవరం: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

author img

By

Published : Aug 19, 2020, 12:21 AM IST

Updated : Aug 19, 2020, 7:15 AM IST

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

kamareddy-district-ellareddy-constancy-mla-surendar-corona-positive
కొవిడ్ కలవరం: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యుడు జాజాల సురేందర్‌కు కరోనా సోకింది.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జిల్లాలోని రామారెడ్డి మండలంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

Last Updated : Aug 19, 2020, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.