ETV Bharat / state

నూతన ఆస్పత్రిలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ

author img

By

Published : Mar 17, 2021, 8:29 PM IST

నూతన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ
నూతన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని.. ప్రగతి భవన్ నుంచి ఏరియా దవాఖానాకు మార్చాలని ఆదేశించారు. ఈ నెలలో లాప్స్ అవుతున్న నిధులుంటే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూర్​ నగర్​లో కొత్తగా నిర్మించిన ఆస్పత్రిని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

ట్రయల్​రన్ బేసిస్​లో..

జిల్లా కేంద్రంలో నూతన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీసీహెచ్ఎస్ డా.తిరుపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్​తో శాఖల పనితీరు, ప్రజలకు అందాల్సిన సేవలపై సమీక్షించారు. దవాఖానాను ప్రస్తుతానికి ట్రయల్​రన్ బేసిస్​లో వినియోగంలోకి తెస్తామని తెలిపారు.

వెనక్కి రప్పించాలి..

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్​లు, లాబ్ టెక్నిషియన్స్, ఇతర క్యాడర్లకు చెందిన హెచ్ఆర్​ను సమకూరుస్తానని పేర్కొన్నారు. డిప్యుటేషన్లలో ఉన్న ఉద్యోగులను వెనక్కి రప్పించాలని ఆదేశించారు. లేదంటే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సద్వినియోగం చేసుకోవాలి..

అందరు జవాబుదారీగా ఉండాలని, మందులు తప్పకుండా ఈ ఔషది పోర్టల్​లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ నెలలో లాప్స్ అవుతున్న నిధులుంటే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆస్పత్రిలో డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం తనిఖీ చేశారు. జిల్లా ఫార్మసీ స్టోర్​లో రికార్డ్స్​ పరిశీలించారు.

ఏరియా దవాఖానాలో క్రిటమిన్, రాండం బ్లడ్ షుగర్ పరీక్షలు కలెక్టర్ చేయించుకున్నారు. ఆయన వెంట సీపీఓ కె.శామ్యూల్, డీపీఆర్ఓ రవికుమార్, డా.మమతాదేవి, డా.ఉమాదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్, డీడీఎం మధుబాబు ఉన్నారు.

ఇదీ చూడండి: గ్రామాల్లో పర్యటిస్తూ... సమస్యల గురించి తెలుసుకుంటూ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.