ETV Bharat / state

ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయి: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

author img

By

Published : Nov 18, 2022, 9:17 PM IST

ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయి : జీవన్​రెడ్డి
ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయి : జీవన్​రెడ్డి

ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. అప్పీల్​ చేసుకునే అవకాశం లేకపోవడమే అన్ని సమస్యలకు కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించే లక్ష్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణితో సమస్యలు అధికమయ్యాయన్నారు.

ధరణితో మరిన్ని సమస్యలు పెరిగాయని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. అప్పీల్​ చేసుకునే అవకాశం లేకపోవడమే అన్ని సమస్యలకు కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూమి సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణితో మరిన్ని సమస్యలు పెరిగాయన్నారు. తహసీల్దార్​, ఆర్డీవో హక్కులను వెంటనే తొలగించాలన్నారు.

తప్పులను సవరించే అధికారం రెవెన్యూ వ్యవస్థ నుంచి తొలగించడంతో పాటు.. ధరణితో ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్​ తొలగించడమే అన్ని సమస్యలకు మూలమని జీవన్​రెడ్డి తెలిపారు. ఆన్​లైన్​​ దరఖాస్తు చేసుకుంటే కనీసం ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా తెలియడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఏది పరిశీలిస్తున్నారో.. ఏది తొలగిస్తున్నారో కూడా తెలియకుండా తెర చాటు చేర్పులు మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు అప్పీల్​ చేసుకునే అవకాశం కూడా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.