ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

author img

By

Published : Feb 26, 2021, 4:28 PM IST

Updated : Feb 26, 2021, 7:07 PM IST

graduate MLC elections
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

16:25 February 26

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్‌తో పాటు మల్లారెడ్డి, లక్ష్మినారాయణ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  

ఈ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తెరాస నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్‌ - చిన్నారెడ్డి, భాజపా అభ్యర్థిగా రామచందర్‌రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్​ నాగేశ్వర్​ బరిలో ఉన్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగియగా.. ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మొత్తం 76 నామినేషన్లు దాఖలవగా.. ఇద్దరివి తిరస్కరణకు గురయ్యాయి. మరో ముగ్గురు భూక్యా కోట్యా, సామల శశిధర్, బెల్గమ్ నాగరాజు ఉపసంహరించుకున్నారు. ఆ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  

ఈ స్థానంలో ప్రధాన పార్టీ అభ్యర్థులుగా తెరాస తరఫున పల్లా రాజేశ్వర్​రెడ్డి, కాంగ్రెస్​ నుంచి రాములునాయక్​, భాజపా తరఫున ప్రేమేందర్​రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పోటీలో నిలిచారు.  

ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మార్చి 14న పోలింగ్‌ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. 

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

Last Updated :Feb 26, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.