ETV Bharat / state

మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు

author img

By

Published : Mar 4, 2020, 12:11 PM IST

the-first-day-inter-exams-ended-in-telangana
మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు

రాష్ట్రంలో మొదటిరోజు ఇంటర్​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్​లో ట్రాఫిక్​ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్​ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ఇంటర్​ మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్‌-1 ప్రశ్నపత్రం 'సెట్‌-ఏ'ను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా... మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.

ఇంటర్​ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు.

ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.