ETV Bharat / state

Letter to Grmb Chairman: గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

author img

By

Published : Oct 28, 2021, 4:56 PM IST

Updated : Oct 28, 2021, 6:59 PM IST

telangana
తెలంగాణ ఈఎన్‌సీ

16:44 October 28

తెలంగాణ డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని లేఖ

ప్రాజెక్టుల డీపీఆర్​లను స్క్రూటినీ పేరిట గోదావరి నదీ యాజమాన్య బోర్డు జాప్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్​కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. బోర్డుకు ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​లు సమర్పిస్తే విభజన చట్టం క్లాజ్ 85(8)(d)లో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ బోర్డు కాలయాపన చేస్తోందని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.  

క్లాజ్​లో పేర్కొన్న అంశాలకు మాత్రమే పరిమితం కావాలన్న తెలంగాణ... మిగతా అంశాలను కేంద్ర జలసంఘంలోని డైరెక్టరేట్లు పరిశీలిస్తాయని పేర్కొంది. డీపీఆర్​లను పరిశీలించే నిపుణత లేదని రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్​ను గతంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సీడబ్ల్యూసీకి పంపిందని లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో తాము ఇచ్చిన డీపీఆర్​లను ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని కోరారు.  

ఇదీ చూడండి:

Viral Video: నోట్లిస్తేనే ఓట్లేస్తాం.. పైసలు అందలేదని రోడ్డెక్కిన ఓటర్లు.. ఎక్కడంటే..?

Last Updated :Oct 28, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.