ETV Bharat / state

రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్‌

author img

By

Published : Feb 6, 2023, 7:49 PM IST

Telangana Budget
Telangana Budget

Telangana Budget 2023-24: ఎనిమిదన్నరేండ్ల తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారిందని పునరుద్ఘాటించిన రాష్ట్ర సర్కారు.. ఈ ప్రగతి ప్రస్తానానికి కొనసాగింపుగా మరోమారు భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు దాదాపు రూ.3 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో పద్దును ప్రవేశపెట్టారు. కేంద్రం సహకరించపోయినా.. రాష్ట్రంపై వివక్షను కొనసాగిస్తున్నా.. జాతి నిర్మాణం, ప్రగతి ప్రస్థానంలో ఉజ్జ్వల పాత్రను పోషించేలా పురోగమిస్తామని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్‌

Telangana Budget 2023-24: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా రాష్ట్ర సర్కారు మరోమారు భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.రూ. 2,90,396 కోట్లతో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుందన్న మంత్రి.. ప్రజాసంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకోవటం రాష్ట్ర ప్రజలందరికి గర్వకారణమని అన్నారు.

ఎన్నికల ప్రయోజనాలు కాకుండా.. ప్రజల అవసరాలే ప్రమాణికంగా భావించే బీఆర్ఎస్ సర్కారు.. ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు మహా సంకల్పంతో ముందుడుగు వేస్తుందని అన్నారు. అనేక సవాళ్లు, అవరోదాలు ఎదురైనా.. కేంద్రం వివక్ష చూపుతున్నా తెలంగాణ ఆప్రతిహతంగా కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం ఆగదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సాధించిన దానికి సంతృప్తి చెంది అక్కడే ఆగిపోకుండా సరికొత్త లక్ష్యాలతో ముందడుగు వేస్తామని భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ రాబడి రూ.2,16,566 కోట్లు, మూలధన రాబడి రూ.55,278 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ.1,31,028 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ.41,259 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. రుణాల ద్వారా రూ.46, 317 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు.

మొత్తం ఆదాయంలో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా ఉంటుందన్న సర్కారు.. మూలధన వ్యయం రూ.37,525 కోట్లని పేర్కొంది. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.28,479 కోట్లు, మూలధన పంపిణీ రూ.12,606 కోట్లని ప్రతిపాదించారు. ఖర్చులు పోనూ రెవెన్యూ మిగులు రూ.4,881 కోట్లుగా ఉంటుందని ప్రతిపాదించిన సర్కారు.. ద్రవ్య లోటు రూ.38,234 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో రూ.3,17,115 ఉండవచ్చన్న సర్కారు.. ఇది జాతీయ సగటు అయిన రూ.1,70,620 కంటే 86 శాతం ఎక్కువని స్పష్టం చేసింది.

రాష్ట్రం మరింత ఉజ్వల పాత్ర పోషించే విధంగా: 2023-24 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు చేరుతాయని పేర్కొన్నారు. జీఎస్‌డీపీలో ఇది 23.8శాతమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో.. రాష్ట్రం మరింత ఉజ్వల పాత్ర పోషించే విధంగా పురోగమిస్తుందని ఆకాంక్షించారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలు, మైనార్టీలు, అగ్రవర్గణ పేదల జీవితాల్లో సంపూర్ణ వికాసాన్ని సాధించే వరకు పరిశ్రమిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఎన్ని అవరోదాలు, అడ్డంకులు ఎదురైనా రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామని, ఈ మహా సంకల్పానికి ప్రజలు అండదండలు అందించాలని కోరారు.

"ఎనిమిదన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన పథకాలు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతుంది. అయినా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాం. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధి ఆగదు." - హరీశ్ రావు, ఆర్థిక మంత్రి

ఇవీ చదవండి: రాష్ట్ర బడ్జెట్​లో సంక్షేమానికి పెద్దపీట.. ఎంత కేటాయించారంటే?

6 బిలియన్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: కేటీఆర్

60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.