ETV Bharat / state

'నిత్యవసరాల ధరలను అదుపుచేయడంలో ప్రభుత్వాలు విఫలం'

author img

By

Published : Feb 10, 2021, 5:20 PM IST

tdp telangana vice president prasuna comment for governments fail to control the prices of essential commodities
'నిత్యవసరాల ధరలను అదుపుచేయడంలో ప్రభుత్వాలు విఫలం'

నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. ప్రస్తుతం పోషక విలువలు కలిగిన ఆహార ధరలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ.. సికింద్రాబాద్​లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్​ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. ఈ మేరకు నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ.. సికింద్రాబాద్​లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రసూన తెలిపారు. కాని ప్రస్తుతం పోషక విలువలు కలిగిన ఆహారం ధరలు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించి అత్యధిక ధరలకు విక్రయిస్తోన్న దళారీలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నాడు ఏకగ్రీవ జోరు.. నేడు పోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.