ETV Bharat / state

'స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థికసంఘం నిధులు విడుదల చేయాలి'

author img

By

Published : Aug 29, 2019, 11:29 PM IST

రాష్ట్ర ఆర్థిక సంఘం

స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని రాష్ట్ర పైనాన్స్​ కమిషన్​ అధ్యక్షుడు రాజేశం గౌడ్​ కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ తెలిపారు.

'కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి'

కేంద్ర ఆర్థిక సంఘం... స్థానిక సంస్థలకు నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్​ అధ్యక్షుడు రాజేశం గౌడ్​ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ ఇంజినీర్స్​ భవన్​లో జరిగిన సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​, మండల ప్రజా పరిషత్​ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు రూ.1400 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాజేశం గౌడ్​ తెలిపారు.

ప్రాధామ్యాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని... ఈ సందర్భంగా విడుదలయ్యే నిధులను ప్రాధామ్యాల ప్రకారం ఖర్చు చేయాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ ఎంపీపీలకు సూచించారు. 2003లో అప్పటి ఫైనాన్స్​ కమిషన్​ ఆధారంగానే నిధుల కేటాయింపు ఉంటుందని... కొత్త సూచనలతో ఎంపీపీలు ముందుకు రావాలని అన్నారు.

ఇదీ చూడండి : 'యుద్ధ ప్రాతిపదికన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవ్వాలి'

Intro:JK_TG_NLG_siridanyalasagu_Pkg_Ts10102

( )
మెట్ట ప్రాంతాల్లో సిరి ధాన్యాల సాగు...

వ్యవసాయం అనగానే అందరికి వాణిజ్య పంటలు సాగు చేయాలనే ఆలోచన వస్తుంది. వాణిజ్య పంటలు అయినా పత్తి వరి పంటల సాగు కు మొగ్గుచూపుతున్నారు. అలాంటి తరుణంలో వినూత్న పంటలకు శ్రీకారం చుట్టారు ఆ ప్రాంత రైతులు. look

మర్రిగూడ మండలం అంటే అభివృద్ధి కి అమాడదురం లో వర్షపాతం తక్కువగా నమోదు అయ్యే ప్రాంతం ఈ ప్రాంతంలో ని రైతులు దాదాపుగా అందరూ వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కానీ జ్ ప్రాంతంలో ని కొంతమంది రైతులు తమ విభిన్న ఆలోచన తో సిరిధాన్యలు సాగు చేస్తున్నారు.మర్రిగూడ మండలం లోని తమ్ముడపల్లి,తిరుగండ్లపల్లి యర్గండ్ల పల్లి గ్రామాల్లోని రైతులు సిరిధాన్యలపై ఆసక్తితో ఆ పంటలు సాగు చేస్తున్నారు. సుమారుగా మర్రిగూడ మండలంలో 320 ఎకరాలలో జొన్న సాగు,50 ఎకరాల్లో కొర్రలు హరికలు ,ఉదలు 10 ఎకరాల్లో సుమారు 20 ఎకరాల్లో సజ్జ పంటలు సాగు చేస్తూ అందరిలో ఔరా అనిపించుకుంటున్నారు ఆ రైతులు.

మిగతా పంటల కంటే పెట్టుబడి తక్కువ....

ఈ సిరిధాన్యల సాగు మిగతా వాణిజ్య పంటల కంటే వీటికి పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండడం తోపాటు రైతుకు పని వత్తిడి కూడా తక్కువ ఉందని,మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుందని ఆలోచించి రైతులు ఈ పంటల సాగుకు పూనుకున్నారు.

ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే ఎక్కువ మొత్తంలో సాగు చేస్తాం....


ప్రభుత్వం గనుక ఈ సిరి ధాన్యాల పంటల సాగు కు సంబంధించిన విత్తనాలు మరియు కావల్సిన పరికరాలు రాయితీలో కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తామంటున్న రైతులు.. రాయితీలేకాకుండా మార్కెట్ లో సిరి ధాన్యాల కు మంచి గిట్టుబాటు ధర కల్పించి ఇన్స్యూరెన్సు సదుపాయం కనుక కల్పించినట్లయితే ఎక్కువ సాగు చేస్తాంమంటున్న రైతులు.


Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా


Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.