ETV Bharat / state

SIRPURKAR COMMISION: ఐసీయూలో ఎందుకు చేర్చారు.. వైద్యునికి ప్రశ్నల వర్షం

author img

By

Published : Oct 9, 2021, 5:14 AM IST

SIRPURKAR COMMISION
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కానిస్టేబుల్ అరవింద్‌కు చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను ప్రశ్నించింది. అరవింద్​కు సాధారణ వైద్యమే అందించినప్పటికీ అత్యవసర చికిత్సా విభాగంలో ఎందుకు చేర్చారని కమిషన్ ప్రశ్నించింది.

దిశ నిందితుల కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ అరవింద్‌కు అందించిన వైద్యం గురించి డిశ్చార్జ్ సమ్మరీలో ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను సిర్పూర్కర్‌ కమిషన్ ప్రశ్నించింది. అరవింద్​కు సాధారణ వైద్యమే అందించినప్పటికీ అత్యవసర చికిత్సా విభాగంలో ఎందుకు చేర్చారని కమిషన్ ప్రశ్నించింది.

దీంతో అత్యవసర సేవల విభాగానికి చెందిన వైద్యులు సూచించడంతో ఐసీయూలో చికిత్స అందించినట్లు డాక్టర్ రాజేశ్​ తెలిపారు. అరవింద్‌కు అందించిన వైద్యం, ఇంజెక్షన్ల గురించి నివేదికలో ఎందుకు పొందుపరచలేదనీ కమిషన్ ప్రశ్నించగా.. నర్సింగ్ స్టాఫ్ పూర్తి వివరాలు నమోదు చేయలేదని రాజేష్ సమాధానమిచ్చారు. ఎన్​కౌంటర్​లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలు, వాటి సామర్థ్యం గురించి హైదరాబాద్ ఎఫ్​ఎస్​ఎల్ఎడీతో పాటు దిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడిని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. శనివారం కూడా కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను మరోసారి కమిషన్ ప్రశ్నించనుంది.

ఇదీ చూడండి: Disha encounter case: 'ఆస్పత్రిలో చేర్పించిన సమయాల్లో తేడాలు ఎందుకున్నాయి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.