సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీసులు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. విజయవాడకు చెందిన ఎలమందరావు అనే ప్రయాణికుడు నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. రైలు ఎక్కుతుండగా హఠాత్తుగా జారి రైలు పట్టాల కిందపడ్డాడు. వెంటనే స్పందించిన జీఆర్పీ కానిస్టేబుల్ డేవిడ్ రాజు ఇతరుల సహాయంతో అతన్ని పైకి లాగారు.
ఘటనలో స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ.. స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ డేవిడ్ రాజును రైల్వే ఎస్పీ అభినందించారు.
ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు