కార్మికులకు ఎంతో మేలు చేసిన రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం కార్మికలోకానికి తీరని లోటని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్లు అన్నారు. నాయిని మృతికి సంతాపంగా ద.మ.రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నివాళి అర్పించారు.
కార్మికుల సంక్షేమం కోసం నాయిని ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు అండగా ఉండేవారన్నారు. కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి... వారి హక్కులను కాపాడడంలో నాయిని కృషిని కొనియాడారు.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా