ETV Bharat / state

'ఉద్యోగులకు బోనస్​ ప్రకటించకపోతే.. రైళ్లన్నీ ఆపేస్తాం'

author img

By

Published : Oct 20, 2020, 5:22 PM IST

employees protest to pay railway bonus
'ఉద్యోగులకు బోనస్​ ప్రకటించకపోతే.. రైళ్లన్నీ ఆపేస్తాం'

రైల్వే ఉద్యోగులు, కార్మికులకు వెంటనే బోనస్​ ప్రకటించాలని లేదంటే ఎల్లుండి నుంచి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అన్ని రైళ్లను ఆపుతామని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్​ యూనియన్​ జోన్​ కార్యదర్శి అరుణ్​కుమార్​ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్​లో రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ప్లాట్​ఫాం నెంబర్​ 10లో మజ్దూర్​ యూనియన్​ నాయకులు, కార్మికులు రెండు గంటల పాటు ధర్నా చేశారు. ఏటా దసరా పండుగకు ముందు ఇవ్వాల్సిన లింకు బోనస్​ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆలిండియా రైల్వే ఫెడరేషన్​ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రేపు పార్లమెంట్​లో క్యాబినెట్​ సమావేశంలో బోనస్​ ప్రకటించకపోతే.. గురువారం ఉదయం సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​తో పాటు ఆలిండియాలో రైళ్లన్నీ ఆపుతామని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్​ యూనియన్​ జోన్​ కార్యదర్శి అరుణ్​కుమార్​ హెచ్చరించారు.

2019-20కు సంబంధించిన బోనస్​లు ఇవ్వాలని లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన బోనస్​ ఇవ్వకపోతే కార్మికులు హైరానా పడతారని అరుణ్​కుమార్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నామని తెలిపారు. తమ హక్కు అయన బోనస్​ కోసం అవసరమైతే రైల్వేను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండిః దిగొచ్చిన బంగారం, వెండి- నేటి ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.