ETV Bharat / state

వైకాపా ఎంపీ​పై పోస్టులు పెట్టిన యువతికి నోటీసులు

author img

By

Published : May 24, 2020, 5:41 PM IST

police case  anusha
వైకాపా ఎంపీ భరత్​పై పోస్టులు... చేసిన వారికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్​పై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన ఉండవల్లి అనూష అనే యువతిపై పోలీసు కేసు నమోదైంది. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

సామాజిక మాధ్యమంలో వైకాపా ఎంపీ మార్గాని భరత్​కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఉండవల్లి అనూష అనే యువతికి పోలీసులు నోటీసులు పంపారు. కార్పొరేట్​ సామాజిక బాధ్యత నిధుల విషయంలో ఎంపీ మార్గాని భరత్​ను సోషల్ మీడియా వేదికగా యువతి ప్రశ్నించింది. ఈ వీడియోలపై రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని బొమ్మూరు పోలీసుస్టేషన్​లో స్థానిక వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూషకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం 41(a) సెక్షన్ కింద యువతికి నోటీసులు అందించారు.

ఇదీ చదవండి: రైతును రాజుగా చూడటమే కేసీఆర్​ లక్ష్యం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.