ETV Bharat / state

ఒక్క నిమిషం నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం

author img

By

Published : Mar 10, 2020, 9:41 PM IST

Updated : Mar 10, 2020, 10:47 PM IST

inter exams
ఇంటర్​ పరీక్షల్లో ఒక్క నిమిషంపై హైకోర్టులో వ్యాజ్యం

21:30 March 10

inter exams

   ఇంటర్మీడియట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతివ్వరాదన్న నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇంటర్ బోర్డు నిబంధనను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాది భాస్కర్ పిల్​ దాఖలు చేశారు. విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ... పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

      ఆలస్యం ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకుని... విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్షకు అనుమతివ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కంట్రోలర్​ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు

Last Updated :Mar 10, 2020, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.