ETV Bharat / state

అందుకోసమే.. జగన్ విశాఖ రాగం: మండిపడ్డ విపక్షాలు

author img

By

Published : Feb 1, 2023, 5:53 PM IST

AP
AP

Opposition Parties Fires on CM Jagan: కొద్దిరోజుల్లోనే ఏపీలోని విశాఖ.. రాష్ట్ర రాజధాని కాబోతుందని జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు స్పందించాయి. బాబాయ్ హంతకులను కాపాడేందుకే.. జగన్ విశాఖ రాజధాని అని సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాజధానుల పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ.. బీజేపీ నేత టీజీ వెంకటేశ్ విమర్శించారు.

Opposition Parties Fires on CM Jagan: జగన్‌కు బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద.. ఆంధ్రప్రదేశ్​లోని ప్రజల మీద లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బాబాయ్ హంతకులను కాపాడేందుకే సీఎం జగన్ విశాఖ రాజధాని అని.. సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చారని కొల్లు ఆరోపించారు. అందుకే డైవర్ట్ పాలిటిక్స్‌కు తెర లేపారని దుయ్యబట్టారు.

ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారు: లిక్కర్ స్కాంలో భార్య పేరు బయటకు రాగానే సీఎం జగన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేర్చు తెరమీదకు తెచ్చారని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. నాడు రాజధానికి 30వేలు ఎకరాలు కావాలని.. ఇల్లు ఇక్కడే కట్టాను అని, ఇప్పడు రాజధాని విశాఖ అంటున్నావు అని ఇది మోసం కాదా జగన్ అని ధ్వజమెత్తారు. ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారని అన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచగానే.. జగన్ మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతాం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. తమ విధానం రాష్ట్రం అభివృద్ధి చెందడం.. అన్ని ప్రాంతాలు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా క్షత్రంలో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని కొల్లు రవీంద్ర అన్నారు.

ప్రజల మధ్య చిచ్చు: రాజధానుల పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని.. బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ మరోసారి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీమ ప్రజలకు అమరావతే దూరం అవుతుంటే.. విశాఖ మరింత దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాయలసీమలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని కోరామని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పిన జగన్.. దాని గురించి ఏమీ మాట్లాడకపోవటం విడ్డూరమని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం ముక్కలయ్యే ప్రమాదం ఉందని టీజీ వెంకటేశ్ వివరించారు.

రాజధానిపై జగన్: మార్చిలో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం జగన్ ఆహ్వానించారు. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన.. కొద్దిరోజుల్లోనే విశాఖ రాష్ట్ర రాజధాని కాబోతుందని అన్నారు. ఏపీకి రాజధాని కాబోతున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేనూ కొద్ది నెలల్లోనే విశాఖకు తరలివెళ్తున్నా. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు జగన్ తెలిపారు.

ఇవీ చదవండి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా

'అమృతకాలపు బడ్జెట్.. నవ భారతానికి బలమైన పునాది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.