ETV Bharat / state

ప్రాణాలు తీస్తున్న పతంగి - అప్పటి వరకు సంతోషంగా గడిపి, అంతలోనే అనంతలోకాలకు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 8:03 PM IST

Boy Dead in Hyderbad While Flying a Kite
Kite Deaths in Telangana

Kite Deaths in Telangana : పండుగ పూట ఆనందంగా గాలిపటం ఎగరేస్తున్న ఆ పిల్లలను విద్యుత్​ రూపంలో మృత్యువు కబళించింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. గాలిపటం ఎగరేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు తమను వదిలిపెట్టి వెళ్లారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Kite Deaths in Telangana : గాలిపటాలు ఎగరేయడమంటే అందరికీ ఇష్టమే. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహం కనబరుస్తుంటారు. పతంగిని మరింత ఎత్తుకు పంపించాలనే తాపత్రయంలో తమ చుట్టుపక్కల పరిసరాలపై నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ నిర్లక్ష్యమే వారి పాలిట మరణ శాసనంగా మారుతోంది. కొందరు విద్యుత్ ​షాక్​తోనూ, మరికొందరు భవనం పైనుంచి కిందకు పడి మృత్యువాతపడ్డారు. గాలిపటాలు ఎగరేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృతి చెందారు.

పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి

Boy Dead in Hyderbad While Flying a Kite : హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గాలిపటాలు ఎగరవేస్తూ అనుమానాస్పదంగా చౌహాన్ శ్రీదేవ్ అనే యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు(Kite Deaths) ఎగరవేసేందుకు వెళ్లిన యువకుడు భవనం మూడో అంతస్తు పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగరవేస్తుండగా ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆరుగురు మిత్రులపై అనుమానంతో తండ్రి నాందేవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాణాలు తీస్తున్న పతంగి సరదా - తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే

Kite Tragedies in Telangana : మైలార్ దేవ్​పల్లిలో విషాదం నెలకొంది. గాలిపటాలు ఎగరేస్తూ 9 సంవత్సరాల బాలుడు విద్యుత్ ​షాక్​తో మృతి చెందాడు . భవనం పైనుంచి గాలిపటాలు ఎగురవేస్తున్న బాలుడు, గాలిపటం మాంజా కరెంటు తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గుర్తించిన కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు తమను వదిలిపెట్టి వెళ్లడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గాలి పటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్​తో బాలుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ నేరేడ్​మెట్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సమయంలో గాలిపటం ఎగుర వేస్తున్న క్రమంలో, భువన్ సాయి అనే బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హలో.. నేను మీ గాలిపటాన్ని.. నా స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.