ETV Bharat / state

CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

author img

By

Published : Oct 17, 2021, 5:02 PM IST

Updated : Oct 17, 2021, 5:32 PM IST

ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ
ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

16:59 October 17

ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

   పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తవుతున్న వేళ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన అధికార తెరాస.. అందుకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణ భవన్‌లో భవన్‌లో సుమారు రెండు గంటలపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి,  తెరాస అధినేత కేసీఆర్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమయ్యారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో(huzurabad by election) తెరాస తప్పకుండా విజయం సాధిస్తుందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. మిగతా పార్టీలకంటే తెరాసకు 13 శాతం అధికంగా ఓట్లు పడతాయని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు నేతలకు వివరించారు. ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటానని కేసీఆర్‌(cm kcr) చెప్పారు. ఈనెల 25న ప్లీనరీ, నవంబర్‌ 15న వరంగల్​లో నిర్వహించే విజయగర్జన సభను ఘనంగా నిర్వహించాలని సూచించారు. సుమారు 10 లక్షల మందితో విజయ గర్జన జరపాలన్న ఆయన.. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.  

కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తాం..  

   ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న కేసీఆర్‌.. వాటిని వివరించే బాధ్యత పార్టీ కార్యకలపై ఉందని తెలిపారు. అందుకోసం త్వరలో పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాసదే విజయమని స్పష్టంచేసిన కేసీఆర్‌.. కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తామని పునరుద్ఘాటించారు.

కేసీఆర్​ తరఫున 6సెట్ల నామినేషన్​    

   మరోవైపు తెరాస అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ(TRS President Election 2021) లాంఛనంగా ప్రారంభమైంది. తెరాస అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మంత్రులు 6 సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్ తరఫున పలువురు మంత్రులతో పాటు ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డికి నామినేషన్ సమర్పించారు. ఈనెల 22 వరకు నామినేషన్లను స్వీకరించి.. 23న పరిశీలన చేపట్టనున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. అనంతరం ఈనెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే పార్టీ ప్రతినిధుల సభలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్లీనరీలో సుమారు 14వేల మంది పార్టీ ప్రతినిధులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు పార్టీ తరఫున ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినందున.. కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే(TRS President Election 2021) అవకాశం ఉంది. కేసీఆర్​ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదించగా.. మిగిలిన వారు బలపరిచారు.

15న తెలంగాణ విజయగర్జన సభ      

   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రెండు దశాబ్దాల్లో తెరాస, ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్​లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థల సేకరణ చేయాలని.. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ సహా పలువురు మంత్రులను కేసీఆర్‌ ఆదేశించారు.

ఇదీ చదవండి: D.Srinivas joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్​లో డీఎస్ చేరిక.. నిజమేనా?

Last Updated :Oct 17, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.