ETV Bharat / state

వీసాల మోసం... గల్ఫ్​ బాధితుల దైన్యం...

author img

By

Published : Jun 26, 2019, 12:04 AM IST

వీసాల మోసం

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలన్న సామాన్యుల ఆశలను ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి... డబ్బులు వసూలు చేసి పర్యాటక వీసాలపై దుబాయ్ పంపించి చేతులు దులుపుకుంటున్నారు. తీరా అక్కడకు వెళ్లాక ఉద్యోగాలు దొరక్క బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా గడువు ముగిశాక చేసేది లేక అప్పు చేసి తిరుగు ప్రయాణమవుతున్నారు. కొంతమంది డబ్బులు లేక అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్​ బాధితుల కష్టాలపై ప్రత్యేక కథనం...

గల్ఫ్​ బాధితుల కష్టాలు

బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన గల్ఫ్ బాధితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్న ఊర్లో ఉపాధి లేక... కుటుంబ పోషణకు అప్పు చేసి ఇతర దేశాలకు వెళ్లినా... వారిని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దుబాయ్​లో ఉద్యోగాలకు సంబంధించిన కనీస నిబంధనలపై అవగాహన లేక ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు.

రూ. 2 లక్షలు వసూలు

ఏజెంట్లు గల్ఫ్​ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు. వీరిని పర్యాటక వీసాపై పంపించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడి బ్రోకర్లు పది రోజుల పాటు పని కల్పించి ఆ తర్వాత చేతులెత్తేశారు. చేసేది లేక కొంతమంది తిరుగప్రయాణమైతే... మరి కొందరు అక్కడే దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. మోసగాళ్లను నమ్మి విదేశాలకు వెళ్లొద్దని గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి తెలిపారు.

నరేందర్​ రెడ్డి దీనగాథ...

హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన నరేందర్ రెడ్డి ఐటీఐ ఎలక్ట్రీషియన్ పూర్తి చేసి షార్జా వెళ్లాడు. అక్కడ ఆరేళ్ల పాటు పనిచేసి... వీసా గడువు ముగిసిన తర్వాత నగరానికి తిరిగొచ్చాడు. అక్కడే పరిచయమైన ఇబ్రహీంఖాన్...​ ఏజెంట్​గా వ్యవహరిస్తున్నానని చెప్పి నరేందర్​ నుంచి విడతల వారీగా లక్షన్నర వసూలు చేశాడు. అలాగే రాములు, ముఖేష్​ నుంచి కూడా రూ. 2 లక్షలు తీసుకున్నాడు. ఇబ్రహీంఖాన్​ వీరిని పర్యాటక వీసాపై దుబాయ్​ పంపించాడు. గడువు ముగిసిన అనంతరం బాధితులు ఇబ్బందులెదుర్కొని తెలిసిన వారి సహాయంతో నగరానికి చేరుకున్నారు. రాములు మాత్రం డబ్బుల్లేక అక్కడే ఉండిపోయాడు. ఏజెంట్​ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు.
పర్యాటక వీసాలతో దుబాయ్​ వెళ్లి మోసపోయిన బాధితులు ఎందరో అక్కడ దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించి అక్రమ ఏజెంట్ల ఆట కట్టించాలని బాధితులు కోరుతున్నారు. తమ వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఆ మాయావృక్షం ఎదుట సురీడూ చిన్నబోవాల్సిందే!



Intro:tg_wgl_61_25_note_books_vitharana_ab_c10
nitheesh, janagama.8978753177
కాకినాడకు చెందిన సమైక్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుశపూర్, బొంతగట్టునాగరం గ్రామాలలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడు మధుకర్ రెడ్డి విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత7 సంవత్సరాలుగా సమైక్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణలోని 5 పాఠశాలలో రాత పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని వచ్చే ఏడాది పాఠశాలల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బైట్: 1.మధుకర్ రెడ్డి, ఉపాధ్యాయుడు,
2. కరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు


Body:1


Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.