ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 339 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Aug 27, 2021, 8:01 PM IST

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 339 కరోనా కేసులు, ఇద్దరు మృతి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 339 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా... మరుసటి రోజుకు వచ్చేసరికి నమోదులో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో 339 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 339 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,56,794కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,867కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 417 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,46,761కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: లీటర్ వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేటు భోజనం రూ.7500!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.