ETV Bharat / state

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Jul 9, 2021, 3:47 PM IST

Updated : Jul 9, 2021, 4:46 PM IST

cm, kcr, telangana
కేసీఆర్​, ముఖ్యమంత్రి

15:45 July 09

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. సూపర్​స్ప్రెడర్స్​కు టీకా పంపిణీ పూర్తయిందా అని అడిగి తెలుసుకున్నారు. 

ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఎంత ఖర్చైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు. పేదలకు కార్పొరేట్​స్థాయి వైద్యం అందాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

ఇదీ చదవండి: రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కైటెక్స్ గ్రూపు యోచన

Last Updated :Jul 9, 2021, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.