అవినీతి నిరోధక శాఖ వలకు పెద్ద చేప చిక్కింది. ఖైరతాబాద్ పరిపాలన విభాగం అధికారిగా పనిచేస్తున్న నరేందర్... సంగారెడ్డికి చెందిన సందీప్ అనే వ్యక్తి నుంచి 36 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ డా.బిఆర్ అంబేడ్కర్ రవాణా శాఖ భవన్లోని కమిషనర్ కార్యాలయంలోనే సదరు అధికారి లంచం తీసుకుంటూ అధికారులకు దొరకడం విడ్డూరం.
నీటి ట్యాంకర్ల తయారీ అనుమతి కోసం ఈ డబ్బు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంతకుముందే 30 వేల రూపాయల లంచం తీసుకున్న నరేందర్... మరోసారి లంచం అడగటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని చెప్పారు. ఇతను 2016లో 8 వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ అనిశాకు దొరికాడు. మరో వైపు ఇతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నడుస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం : సీఎం కేసీఆర్