ETV Bharat / state

మెట్రోలో బండి సంజయ్ ప్రయాణం.. గాంధీ భవన్ టూ మియాపూర్

author img

By

Published : Mar 4, 2022, 5:15 PM IST

మెట్రోలో బండి సంజయ్ ప్రయాణం
మెట్రోలో బండి సంజయ్ ప్రయాణం

Bandi Sanjay Metro Journey: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మెట్రోలో ప్రయాణం చేశారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు పలువురు భాజపా నేతలతో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నివాసానికి వెళ్లారు.

Bandi Sanjay Metro Journey: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆ పార్టీ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణం చేశారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించిన భాజపా నేతలు... అక్కడి నుంచి పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల నందీశ్వర్ గౌడ్ తండ్రి స్వర్గస్తులు కావడంతో ఆయన కుటుంబ సభ్యులను భాజపా నేతలు పరామర్శించారు.

Bandi Sanjay Metro Journey, bandi sanjay in patancheru
మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో భాజపా నేతలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తండ్రి వీర మోహన్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎంపీ సతీష్, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తదితర భాజపా నాయకులు పాల్గొన్నారు.

మెట్రోలో బండి సంజయ్ ప్రయాణం

ఇదీ చదవండి: రాంచీలో కేసీఆర్ పర్యటన.. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రితో భేటీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.