ETV Bharat / state

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు - మిల్లెట్స్‌తో రుచికరమైన భోజనం

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 12:08 PM IST

American Citizen Running Millet Food Restaurant In Hyderabad : కేంద్రప్రభుత్వం తరచూ చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ప్రకటిస్తోంది. దాన్నే వ్యాపారంగా ములుచుకొని హైదరాబాద్ లో మిల్లెట్ విల్లెట్‌ను ఆహార కేంద్రాన్ని స్థాపించి రాణిస్తున్నారు కమల్‌ వద్వాని. అందరికీ చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు ఇక్కడే కాకుండా అమెరికాలోనూ వ్యాపారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.

Millet Willet Restaurant In Hyderabad :
American Citizen Running Millet Food Restaurant In Hyderabad

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు - మిల్లెట్స్‌తో రుచికరమైన భోజనం

American Citizen Running Millet Food Restaurant In Hyderabad : కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యకరమైన, సంప్రదాయ ఆహారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. నగరాల్లో చిరుధాన్యాలతో చేసిన ఆహారానికి గిరాకీ బాగా పెరగడంతో అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి దీన్నే వ్యాపారంగా మలుచుకోవాలని అనుకున్నాడు. మిల్లెట్స్‌తో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.

భారత్​లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్​, ఐఐఎంఆర్​

Different Types Of Healthy Tiffins With Millets In Hyderabad : స్వచ్ఛమైన మనసుతో మంచి చేయాలనే ఆలోచన బలంగా ఉంటే అందుకు విశ్వం సహకరిస్తుంది అంటారు. కమల్ వద్వాని విషయంలో అది అక్షరాలా నిజమని చెప్పవచ్చు. కమల్ గద్వాని తల్లిదండ్రులు భారతీయులే. ఆయన 16వ ఏట తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. వారితో పాటు అక్కడికి వెళ్లిన ఆయన కొన్నాళ్లకు స్వదేశానికి తిరిగివచ్చారు. ఇక్కడ పాఠశాల, కళాశాలలకి వెళ్లే విద్యార్థులు బయట దొరికే రకరకాల ఆహారం తిని ఆరోగ్యం పాడు చేసుకుంటూ స్థూలకాయులవుతున్నట్లు గమనించిన ఆయన వారికోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని విక్రయించాలని సంకల్పించారు.

ఈఏడాదిని ఐరాస మిల్లెట్ సంవత్సరంగా పాటించాలని పిలుపునిచ్చింది. కేంద్రప్రభుత్వం తరచూ చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ప్రకటిస్తోంది. దాన్నే వ్యాపారంగా ములుచుకొని హైదరాబాద్ లో మిల్లెట్ విల్లెట్‌ను ఆహార కేంద్రాన్ని స్థాపించి రాణిస్తున్నారు కమల్‌ వద్వాని. అందరికీ చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు ఇక్కడే కాకుండా అమెరికాలోనూ వ్యాపారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.

Millet Restaurant at RGI Airport : మిల్లెట్​ రెస్టారెంట్​ @శంషాబాద్ ఎయిర్​పోర్ట్​.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్​లో

''చిరుధాన్యలతో చేసిన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి కావలసిన పోషకాలు కూడా దీనిలో ఉంటాయి. వీటిిని రోజూ మనం ఆహారంలా తీసుకుంటే ఆరోగ్యంగా ఆస్పత్రికి వెళ్లకుండా ఉంటారు. ఇక్కడ మూడు రకాల ఇడ్లీలు, దోసెలు, జావ దొరుకుతుంది."-కమల్ వద్వాని, మిల్లెట్ విల్లెట్ యజమాని

Millet Willet Restaurant In Hyderabad : ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నామని కానీ! ఇలాంటి కేంద్రాల వల్ల ఆరోగ్యం చేరువవుతుందని వినియోగదారులు అంటున్నారు. అభిరుచులకు తగినట్లు రుచికరమైన ఆహారం అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ అంటే ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల పదార్థాలు తయారు చేయిస్తున్నారు కమల్. రుచికిరుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండటంతో ప్రజలు మొగ్గుచూపారు.

మూడు రకాల ఇడ్లీలు, దోసెలు, జావ ఇలా చూడగానే నోరూరించేలా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఐటెమ్ ఉండేలా చూసుకుంటారు. ఆహారం రుచిగా ఉండటంతో పాటు పరిసర ప్రాంతాలు వడ్డించే విధానం అందంగా ఉంటేనే ప్రజలు తినడానికి ఆసక్తి చూపుతారన్న వ్యాపార సూత్రాన్ని అనుసరిస్తున్నారు కమల్. ఇడ్లీలను రాగిపాత్రలో ఆవిరి ద్వారా ఉడికించడం, రాగి గ్లాస్‌లలో జావా పోయడం, విస్తరాకులో ఇడ్లీలు పెట్టడం ఇలా ఆహారాన్ని వడ్డించే పద్ధతి భిన్నంగా ఉండేలా చూసుకుంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

ఉదయం లేవగానే 'టీ'కి బదులు.. 'మిల్లెట్ అంబలి' ట్రై చేయండి

Millet Products : చిరుధాన్యాలతో తినుబండారాలు.. విక్రయాలతో సిరులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.