ETV Bharat / state

'ఏసీబీ అదుపులో మౌలాలి ఏఎల్​వో'

author img

By

Published : Feb 28, 2020, 9:28 PM IST

ACB RIDE
ACB RIDE

ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న యజమానిని రూ. 10 వేలు డిమాండ్ చేసిన మౌలాలి ఏఎల్​వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లోని జవహర్​నగర్ కార్మిక శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది.

ఓ ఏజెన్సీకి అనుమతి ఇచ్చేందుకు బలరామ్​ ప్రసాద్​ అనే వ్యక్తిని రూ. 10 వేలు డిమాండ్​ చేసిన మౌలాలి ఏఎల్​వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లోని జవహర్​నగర్ కార్మిక శాఖ కార్యాలయంలో జరిగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరికి చెందిన బలరామ్ ప్రసాద్ మ్యాన్ పవర్ ఏజెన్సీ కోసం ఈ నెల 4న జవహర్​నగర్​లోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.

దరఖాస్తు పరిశీలించిన మౌలాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీయుద్దీన్​ పదివేల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు రూ. 4 వేలను ఇచ్చినప్పటికీ... దరఖాస్తును పెండింగ్​లో పెట్టడం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులు, కార్మిక శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అబ్దుల్ షఫీయుద్దీన్​ను అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

'ఏసీబీ అదుపులో మౌలాలి ఏఎల్​వో'

ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.