ETV Bharat / state

వినూత్న నిరసన.. రిమ్స్‌ కార్మికుల భిక్షాటన

author img

By

Published : Mar 16, 2021, 7:35 PM IST

RIMS out sourcing employees nirasana on not giving salaries last four months in Adilabad district
వినూత్న నిరసన.. రిమ్స్‌ కార్మికుల భిక్షాటన

ఆదిలాబాద్​ రిమ్స్ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది వినూత్నంగా నిరసన తెలియజేశారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంపై భిక్షాటన చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ ఆదిలాబాద్​ రిమ్స్​ ఆస్పత్రి ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది భిక్షాటన చేశారు. జీతాల్లేక నానా అవస్థలు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు ఇవ్వడం లేదని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ పట్ల రిమ్స్‌ డైరెక్టర్‌, గుత్తేదారుల నిర్లక్ష్యంపై కార్మికులు మండిపడ్డారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీకి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.