ETV Bharat / sports

Tokyo Paralympics: పతాకధారిగా అవకాశాన్ని కోల్పోయిన గోల్డ్​ మెడలిస్ట్​

author img

By

Published : Aug 24, 2021, 12:52 PM IST

Tokyo Paralympics: Javelin thrower Tek Chand named new flag bearer of India for opening ceremony
Tokyo Paralympics: సువర్ణ అవకాశాన్ని కోల్పోయిన గోల్డ్​ మెడలిస్ట్​

టోక్యో పారాలింపిక్స్​(Tokyo Paralympics) ఆరంభ వేడుకల్లో భారత పతాకాన్ని చేతబూనే అవకాశాన్ని చేజార్చుకున్నాడు హైజంప్​ క్రీడాకారుడు మరియప్పన్​ తంగవేలు(Mariyappan Thangavelu). కరోనా సోకిన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న కారణంగా అతడి స్థానంలో జావెలిన్​ త్రోవర్​ టెక్​ చంద్​ ఎంపికయ్యాడు.

పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొనేందుకు టోక్యోకు చేరుకున్న భారత బృందానికి ఊహించని షాక్​ ఎదురైంది. భారత హైజంప్​ క్రీడాకారుడు మరియప్పన్​ తంగవేలుపై(Mariyappan Thangavelu) కరోనా ప్రభావం పడింది. భారత్​ నుంచి టోక్యోకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడితో తంగవేలు సన్నిహితంగా ఉన్నాడు. దీంతో ఆరంభ వేడుకల్లో భారతదేశ జెండాను చేతపట్టాల్సిన అవకాశాన్ని తంగవేలు చేజార్చుకున్నట్లు అయ్యింది. దీంతో మరియప్పన్​ స్థానంలో జావెలిన్​ త్రోవర్​ టెక్​ చంద్​(Athlete Tek Chand) తివర్ణ పతాకాన్ని చేతబూని నడవనున్నాడు.

2016 రియో పారాలింపిక్స్​ హైజంప్​ క్రీడలో స్వర్ణం సాధించిన మరియప్పన్​ తంగవేలుకు.. 2017లో పద్మశ్రీ, అర్జున పురస్కారాలతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. గతేడాది మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న అవార్డునూ అందుకున్నాడు.

టోక్యో పారాలింపిక్స్​లో ఈ సారి భారతదేశం తరఫున అత్యధికంగా 54 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆగస్టు 24న ప్రారంభమైన ఈ క్రీడలు సెప్టెంబరు 5 వరకు జరగనున్నాయి.

ఇదీ చూడండి.. మేరీకోమ్​కు అవకాశం.. సింధుకు తప్పని నిరాశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.