ETV Bharat / sports

అఫ్గానిస్థాన్​ పారాలింపిక్​ క్రీడాకారులు సేఫ్​

author img

By

Published : Aug 27, 2021, 12:02 PM IST

Afghanistan's Tokyo Games Paralympians safely evacuated, says IPC
అఫ్గానిస్థాన్​ పారాలింపిక్​ క్రీడాకారులు సేఫ్​

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొనాల్సిన ఇద్దరు అఫ్గానిస్థాన్​ క్రీడాకారులు ఆ దేశ సరిహద్దులు దాటారని అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ(ఐపీసీ) వెల్లడించింది. ఆ దేశానికి చెందిన మహిళా అథ్లెట్​ జాకియా ఖుదాదాదితో పాటు మరో క్రీడాకారుడు హుస్సేన్ రసౌలి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తమకు తెలుసునని ఐపీసీ అధికార ప్రతినిధి క్రెయిగ్​ స్పెన్స్​(IPC spokesman Craig Spence) వెల్లడించారు. విశ్వక్రీడల్లో వారిద్దరూ పాల్గొనే విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలిపారు.

అఫ్గానిస్థాన్​కు చెందిన ఇద్దరు పారాలింపిక్​(Tokyo Paralympics) అథ్లెట్లు క్షేమంగా ఆ దేశ సరిహద్దు దాటారని అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ(ఐపీసీ) వెల్లడించింది. ఈ క్రీడల్లో వారు పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. అయితే కమిటీ వారిద్దరి ఆచూకీని మాత్రం బహిర్గతం చేయలేదు.

"ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. పారాలింపిక్స్​ ఆరంభోత్సవంలో అఫ్గానిస్థాన్​ జెండాను సంఘీభావంగా ప్రదర్శించాం. ఆ దేశానికి చెందిన ఇద్దరు పారా అథ్లెట్లు.. అఫ్గాన్​ సరిహద్దులు దాటి బయటకు వచ్చారు. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు".

- క్రెయిగ్​ స్పెన్స్​, ఐపీసీ అధికార ప్రతినిధి

"ప్రస్తుతం వారిద్దరు క్రీడల్లో పాల్గొనే దానికి ముందు వారి ఆరోగ్యానికి ప్రాధ్యాన్యమివ్వడం ప్రాథమిక బాధ్యత. ఇదే విషయమై కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాం. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం ముఖ్య"మని క్రెయిన్​(Craig Spence) అన్నారు.

అఫ్గానిస్థాన్​కు చెందిన మహిళా అథ్లెట్​ జాకియా ఖుదాదాదితో(Zakia Khudadadi) పాటు మరో క్రీడాకారుడు హుస్సేన్ రసౌలి(Hossain Rasouli).. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్​లో పాల్గొనాల్సిఉంది. అయితే ఆ దేశ రాజధాని కాబుల్​ను తాలిబన్లు ఆక్రమించిన కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగింది. దీంతో జాకియా ఖుదాదాది ఓ మీడియాసంస్థతో మాట్లాడుతూ.. తన దేశం తరఫున పారాలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. దాని కోసం ఆమె ప్రపంచదేశాల సాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె అఫ్గానిస్థాన్​ నుంచి బయటకు రావడం వల్ల విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయమై అంతర్జాతీయ పారాలింపిక్స్​ కమిటీ అధికార ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ స్పష్టత ఇచ్చారు.

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ను తాలిబన్లు అక్రమించుకున్న(Taliban's takeover) తర్వాత అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. దీంతో పారాలింపిక్స్​లో పాల్గొనేందుకు అథ్లెట్లకు ప్రయాణించే అవకాశం లేకపోయింది. దీంతో ఆ దేశ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం లేదని అంతర్జాతీయ పారాలింపిక్స్​ కమిటీ అంతకుముందు వెల్లడించింది.

ఇదీ చూడండి.. సిరాజ్​ బౌలింగ్​కు ఫిదా అయిన పాకిస్థానీ అభిమాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.