ETV Bharat / sports

దంచికొట్టిన డస్సెన్-మార్​క్రమ్ .. ఇంగ్లాండ్ లక్ష్యం 190

author img

By

Published : Nov 6, 2021, 9:19 PM IST

T20 world cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో సెమీస్​ బెర్తు కోసం జరుగుతున్న పోరులో ​దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ప్రోటీస్​ బ్యాటర్స్ డస్సెన్​, మార్​క్రమ్ చెలరేగిన వేళ 189 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు డస్సెన్ (94), మార్​క్రమ్ (52) చెలరేగిపోయారు. సెమీస్​ చేరాలంటే మెరుగైన రన్​రేట్​ సాధించాల్సిన నేపథ్యంలో ధాటిగా ఆడుతూ అర్ధ శతకాలు బాదారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్​ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. డికాక్ (34) ఫర్వాలేదనిపించాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.