ETV Bharat / sports

సింగపూర్ ఓపెన్​లో సత్తా చాటిన సింధు, ప్రణయ్.. క్వార్టర్స్​లోకి ఎంట్రీ

author img

By

Published : Jul 14, 2022, 12:00 PM IST

సింధు
సింధు

PV Sindhu: సింగపూర్​ ఓపెన్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచుల్లో షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ విజయం సాధించారు. వీరిద్దరూ క్వార్టర్స్​కు దూసుకెళ్లారు. సింధు.. వియత్నాంకు చెందిన థయ్​ లిన్హ్​పై గెలుపొందగా.. తైవాన్​కు చెందిన చౌ టైన్​పై ప్రణయ్​ విజయం సాధించాడు.

Singapore badminton open 2022: సింగపూర్​ ఓపెన్​ సూపర్​ 500 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​లో తెలుగు షట్లర్లు పీవీ సింధు, హెచ్​ఎస్​ ప్రణయ్​ సత్తా చాటారు. గురువారం జరిగిన మ్యాచ్​లో వీరు విజయం సాధించి క్వార్టర్స్​కు దూసుకెళ్లారు. వియత్నాంకు చెందిన థయ్​ లిన్హ్​తో తలపడిన సింధూ.. 19-21, 21-19, 21-18 పాయింట్ల తేడాతో గెలిచింది. క్వార్టర్స్​లో చైనాకు చెందిన హన్​ యూను ఎదుర్కోనుంది.

మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్​లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న తైవాన్​కు చెందిన చౌ టైన్​తో తలపడిన ప్రణయ్​.. ప్రత్యర్థిపై విజయం సాధించాడు. గంటా తొమ్మిది నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 14-21, 22-20, 21-18 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.

ఇదీ చూడండి : కేఎల్​ రాహుల్​తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.