ETV Bharat / sports

'కోహ్లీ స్లెడ్జింగ్​ను నేను ఎంజాయ్​ చేశా'

author img

By

Published : May 24, 2021, 9:43 PM IST

surya kumar yadav, virat kohli
సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​ 13వ సీజన్​లో కోహ్లీతో జరిగిన ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యువ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్. విరాట్ స్లెడ్జింగ్​ను తాను ఎంజాయ్​ చేసినట్లు పేర్కొన్నాడు.

గతేడాది ఐపీఎల్​లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ తనను స్లెడ్జింగ్​ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యువ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్ యాదవ్. ముంబయి ఇండియన్స్​ ఇన్​స్టా ఖాతాలో లైవ్​ చాట్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

"లక్ష్య ఛేదనలో నేను గెలిచాను. కోహ్లీ నా వికెట్ కోసం రెచ్చగొట్టాలని చూశాడు. కానీ, ప్రశాంతంగా నా పని నేను కానిచ్చాను. అతడు నన్ను మాత్రమే కాదు.. ఆ సమయంలో ఎవరినైనా అలానే చేసేవాడేమో. విరాట్ నన్ను స్లెడ్జ్​ చేసినందుకు సంతోషంగా అనిపించింది. నేను గొప్పగా ఆడుతున్నాను కాబట్టే నా వికెట్ కోసం నన్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అదే జరిగితే రన్​రేట్ మందగించి మేము ఓడిపోయే అవకాశం ఉండేది," అని సూర్యకుమార్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

మ్యాచ్​ తర్వాత అంతా మాములుగా ఉందని సూర్య తెలిపాడు. మైదానంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నాడు. "గ్రౌండ్​లో ఉన్నప్పుడు నేను కూల్​గా ఉంటాను. వివాదాల జోలికి వెళ్లను" అని యాదవ్ స్పష్టం చేశాడు.

ఆనాడు.. ముంబయి, బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్​లో రోహిత్ సేన గెలుపొందింది. ఈ మ్యాచ్​లో సూర్యకుమార్ 79 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇదీ చదవండి: 'బీసీసీఐ.. నాకు కూడా బాకీ ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.