ETV Bharat / sports

భారత జట్టుతో కెప్టెన్​ కూల్​.. యువ ఆటగాళ్లతో ముచ్చట్లు!

author img

By

Published : Jul 10, 2022, 9:29 AM IST

ms dhoni latest news
జట్టుతో ధోనీ

IND vs ENG t20: ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించాడు మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్​లో పెట్టింది.

IND vs ENG t20: మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుతో కలిసి ప్రత్యక్ష్యమయ్యాడు. ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించాడు. ఇటీవలే జరిగిన తన 41 పుట్టినరోజు వింబుల్డన్ మ్యాచ్​ను తిలకించాడు కెప్టెన్ కూల్​. ఈ క్రమంలోనే ఎడ్జ్​బాస్టన్​లో ఉన్న భారత జట్టును కలిశాడు మహీ. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్​లో పెట్టింది. " గ్రేట్ ధోనీ మట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు" అని పోస్ట్ చేసింది.

ms dhoni latest news
జట్టుతో ధోనీ
ms dhoni latest news
జట్టు సభ్యులతో ధోనీ

IND vs ENG t20: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 49 రన్స్​ తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్​ను టీమ్​ ఇండియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుచుకుంది టీమ్​ఇండియా. 17 ఓవర్లలో 121 పరుగులకు ఇంగ్లాండ్​ను భారత్​ ఆల్ అవుట్ చేసింది. ఇంగ్లాండ్‌ జట్టులో మొయిన్‌ అలీ (35; 21 బంతుల్లో 3x4, 2x6), డేవిడ్‌ విల్లే (33 నాటౌట్‌; 22 బంతుల్లో 3x4, 2x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లు ఆది నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. భువనేశ్వర్‌ కుమార్‌ 3, బుమ్రా, చాహల్‌ 2 వికెట్లు తీయగా హార్దిక్‌ పాండ్య, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ms dhoni latest news
జట్టుతో ధోనీ

మ్యాచ్​కు హాజరైన ధోనీ, సునీల్​ గావస్కర్​..: ఇటీవలే జరిగిన వింబుల్డన్​ మ్యాచ్‌కు టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హాజరయ్యాడు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సానియాను ప్రోత్సహించాడు.

ms dhoni latest news
వింబుల్డన్​ మ్యాచ్​లో ధోనీ

ఇదీ చదవండి: రెండో టీ-20లో ఇంగ్లాండ్​ చిత్తు.. మరో సిరీస్​ భారత్​ కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.