ETV Bharat / sports

లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 ఛాంపియన్​గా భజ్జీ టీమ్​- ప్రైజ్​మనీ ఎంతో తెలిస్తే షాకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 6:20 PM IST

Updated : Dec 10, 2023, 6:30 PM IST

Legends League Cricket 2023 Winner Prize Money
Legends League Cricket 2023 Winner Prize Money

Legends League Cricket 2023 Winner Prize Money : లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ రెండో సీజన్​గా విజేతగా నిలిచిన మణిపాల్ టైగర్స్​కు రూ. 2 కోట్ల ప్రైజ్​ మనీ దక్కింది. ఇంకా ఈ టోర్నీలో మరిన్ని విశేషాలు.

Legends League Cricket 2023 Winner Prize Money : 2023 లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్​గా నిలిచిన మణిపాల్ టైగర్స్ రూ. 2 కోట్ల ప్రైజ్​ మనీ అందుకుంది. రన్నరప్​గా నిలిచిన అర్బన్​రైజర్స్ హైదరాబాద్​కు రూ. కోటి దక్కింది. ఆదివారం జరిగిన తుదిపోరులో​ అర్బన్​రైజర్స్ హైదరాబాద్​ - మణిపాల్ టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్బన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187-5 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనలో మణిపాల్ 19 ఓవర్లలో 5 వికెట్లు 193 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ రెండో సీజన్ విజేతగా మణిపాల్ టైగర్స్ నిలిచింది. కాగా, టీమ్ఇండియా మాజీలు సురేశ్ రైనా హైదరాబాద్​కు నాయకత్వం వహించగా, హర్భజన్ సింగ్ మణిపాల్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు.​

ఈ టోర్నమెంట్ ​నవంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 09న ముగిసింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, హర్బజన్ సింగ్, శ్రీశాంత్, పార్థీవ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్​తోపాటు క్రిస్​ గేల్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, మోర్నీ మోర్కెల్ తదితరులు ఆయా జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మరిన్ని విశేషాలు.

  • టోర్నీ విజేత - మణిపాల్ టైగర్స్ - రూ. 2 కోట్లు ప్ర్రెజ్ మనీ
  • టోర్నీ రన్నరప్- అర్బన్​రైజర్స్ హైదరాబాద్​ - రూ. 1 కోటి ప్ర్రెజ్ మనీ
  • లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- తిసారా పెరీరా (108 పరుగులు, 8 వికెట్లు)
  • లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 అత్యధిక పరుగులు- డ్వేన్ స్మిత్ (234 పరుగులు, 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ)
  • లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 అత్యధిక వికెట్లు- ఇమ్రాన్ ఖాన్ (9 వికెట్లు)

అసలేంటీ లెజెండ్ క్రికెట్ లీగ్ ? అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ప్లేయర్ల కోసం ఈ లెజెండ్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నారు. టీమ్ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఈ లీగ్​కు కమిషనర్​గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ లీగ్​ను 'మాస్టర్స్ టోర్నమెంట్', 'ఫ్రాంచైజీ టోర్నమెంట్' రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. మాస్టర్స్ టోర్నీలో ఇండియా మహరాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ మూడు జట్లు ఉండగా, ఫ్రాంచైజీ టోర్నీలో భారత్​కు చెందినవే ఆరు జట్లు పాల్గొంటాయి.

'నన్ను ఫిక్సర్ అంటూ పిలిచాడు, వాళ్లు అతడ్ని సేవ్ చేయాలని చూస్తున్నారు' గంభీర్​తో గొడవపై శ్రీశాంత్ క్లారిటీ

Cricketers In Movies : హర్భజన్ సింగ్ టు ధోనీ.. ఈ క్రికెటర్స్​ సినిమాల్లో ఫెయిల్​..

Last Updated :Dec 10, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.