ETV Bharat / sports

IPL 2023 RCB VS CSK : విరాట్​కు షాక్​.. ఫీజులో 10శాతం ఫైన్

author img

By

Published : Apr 18, 2023, 10:58 AM IST

Updated : Apr 18, 2023, 11:45 AM IST

virat kohli
virat kohli

ఆర్సీబీ ప్లేయర్​ విరాట్​ కోహ్లీకి షాక్ ఇచ్చారు ఐపీఎల్​ నిర్వాహకులు. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు.

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఆర్సీబీ ప్లేయర్​ విరాట్​ కోహ్లీకి గట్టి షాక్​ తగిలింది. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో అతడిపై జరిమానా పడింది. ఐపీఎల్​లో ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత పడింది. ఈ మేరకు కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 నేరం కింద కోహ్లీ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అతడిపై ఎందుకు జరిమానా విధించార్నన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇందుకు కారణమేంటా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే చెన్నై టీమ్​ బ్యాట్స్‌మెన్ శివమ్ ధుబే ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. బహుశా అందుకే అతడికి జరిమానా విధించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

హర్షల్‌ను ఎందుకు ఆపారంటే..?
చెన్నై టీమ్​ బ్యాటింగ్​కు దిగిన సమయంలో ఆర్సీబీ పేసర్ హర్షల్‌ పటేల్‌ చివరి ఓవర్‌ వేశాడు. అయితే, తొలి మూడు బంతులను మాత్రమే సంధించాక అతడ్ని ఆ తర్వాత బౌలింగ్‌కు అనుమతించలేదు. దానికి కారణం వరుసగా రెండు బీమర్లను సంధించడమే. బౌన్స్‌ లేకుండా నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతిని సంధిస్తే దానిని బీమర్‌గా పరిగణిస్తారు. అందుకే రెండు బీమర్లు వేస్తే ఆ ఓవర్‌ను కొనసాగించడానికి సదరు బౌలర్‌కు అంపైర్‌ అవకాశం ఇవ్వరు. చెన్నైతో మ్యాచ్‌లో హర్షల్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలోనూ ఇదే జరిగింది. దీంతో చివరి మూడు బంతులను వేసేందుకు మ్యాక్స్‌వెల్‌ రంగంలోకి దిగాడు. మూడు బంతుల్లో సిక్స్‌ సహా 9 పరుగులు ఇచ్చిన మ్యాక్స్‌వెల్ ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు.

ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాట్​ చేతబట్టిన చెన్నై టీమ్​ బ్యాటింగ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులను స్కోర్​ చేసింది. ఈ క్రమంలో చెన్నై ఓపెనర్ డేవాన్ కాన్వే (83), శివమ్ ధుబే (52) మైదానంలో తమదైన శైలిలో విజృంభించారు. ఆ తర్వాత దిగిన బెంగళూరు జట్టు మాత్రం.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులను మాత్రమే స్కోర్​ చేయగలిగింది. ఆర్సీబీకి చెందిన డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (76) తమ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్​ను ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ వరుస వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమిపాలవ్వక తప్పలేదు.

Last Updated :Apr 18, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.