ETV Bharat / sports

IPL 2023 : బెంగళూరుకు భారీ షాక్​.. రజత్​ పాటిదార్​, హేజిల్​ వుడ్​ ఔట్!

author img

By

Published : Mar 26, 2023, 11:23 AM IST

Updated : Mar 26, 2023, 11:33 AM IST

Rajat Patidar Hazlewood would miss first half of IPL 2023
Rajat Patidar Hazlewood would miss first half of IPL 2023

ఐపీఎల్​ సీజన్​కు ముందు రాయల్​ ఛాలెంజర్స్​ జట్టుకు భారీ షాక్​లు తగలనున్నాయి. ఆ జట్టు ప్లేయర్లు రజిత్​ పాటిదార్​, హేజిల్​ వుడ్​ లీగ్​ ఆడడం అనుమానమే!

మరో ఐదు రోజుల్లో క్రికెట్​ అభిమానులు ఎదురుచూసే ఐపీఎల్​ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్​ ప్రాక్టీస్​ కూడా మొదలుపెట్టేశారు. మరికొంతమంది రెండు మూడు రోజుల్లో తమ క్యాంపులకు చేరుకుని శిక్షణ ప్రారంభించనున్నారు. అయితే అన్ని ఫ్రాంచైజీలను గాయాల బెడద తీవ్రంగా కలవరపెడుతోంది.

గాయాల కారణంగా పలువురు ప్లేయర్లు సీజన్​లోని కొన్ని మ్యాచ్​లకు లేదంటే పూర్తి సీజన్​కు దూరమవుతున్నారు. తాజాగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు కీలకమైన ఇద్దరు ప్లేయర్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. లీగ్​లో తొలి సగం మ్యాచులకు బ్యాటర్​ రజత్​ పాటిదార్​ దూరం కానున్నాడట. స్టార్​ బౌలర్​ హేజిల్​ వుడ్​ లీగ్​ నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం రజత్​ పాటిదార్​.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. మడమ గాయంతో బాధపడుతున్న అతడు.. ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. ఇంకో మూడు వారాల పాటు పాటిదార్​ విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని సమాచారం. అంతే కాకుండా అతడు ఆర్సీబీ తరఫున ఆడాలంటే నేషనల్​ క్రికెట్​ అకాడమీ క్లియరెన్స్​ అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

గతేడాది మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిగిలిన రజత్​ పాటిదార్​ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. లీగ్​ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. ఏడు మ్యాచులు ఆడిన పాటిదార్.. 333 పరుగులు సాధించాడు. టుప్లెసిస్​, విరాట్​ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా నిలిచాడు.

మరోవైపు, ఆస్ట్రేలియా స్టార్​ పేసర్​ జోష్​ హేజిల్ వుడ్​​ కూడా సీజన్ మొత్తానికి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. గాయాల బారిన పడిన అతడు ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నాడు. గతేడాది మెగా వేలంలో రూ. 7.75 కోట్లుకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. 2023 సీజన్​ మినీ వేలానికి ముందు అతడిని అట్టిపెట్టుకుంది.

అయితే ఇప్పటికే పలు జట్లకు చెందిన ఆటగాళ్లు సీజన్​కు దూరమయ్యారు. వెన్ను గాయం కారణంగా ముంబయి స్టార్ పేసర్​ బుమ్రా, కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ పంత్ ఈ లీగ్​కు అందుబాటులో ఉండట్లేదు. వీరితో పాటు ఇంకెవరు అందుబాటులో ఉండట్లేదో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated :Mar 26, 2023, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.