ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: ఆ విషయంలో విరాట్​ కోహ్లీ టాప్​

author img

By

Published : Nov 18, 2020, 4:41 PM IST

Kohli
కోహ్లీ

కరోనా పరిస్థితుల్లో జరిగినా ఈ ఏడాది ఐపీఎల్​ గురించి నెటిజన్లు బాగానే మాట్లాడుకున్నారు. సోషల్​ మీడియాలో కోహ్లీ, చెన్నై సూపర్​ కింగ్స్​​ గురించే అత్యధికులు చర్చించుకున్నారని ట్విట్టర్​ సంస్థ తెలిపింది.

ఈ ఏడాది ఐపీఎల్​ గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. కరోనా నేపథ్యంలో విదేశంలో జరిగినా ఈ మెగా లీగ్​ రసవత్తరంగా జరిగింది. అందుకే సోషల్​ మీడియాలోనూ అభిమానులు బాగా ముచ్చట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ ప్లాట్​ఫాంలో ఎక్కువగా వచ్చిన ట్వీట్స్​ ఆధారంగా కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది ట్విట్టర్​. వ్యక్తుల్లో కోహ్లీ, జట్లలో చెన్నై సూపర్​ కింగ్స్​ గురించే ఎక్కువమంది మాట్లాడుకున్నట్లు తెలిపింది .

జట్లలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది ట్విట్టర్​. ఈ జాబితాలో దిల్లీ క్యాపిటల్స్​ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Virat Kohli
కోహ్లీ
dhoni
ధోనీ

'గోల్డెన్​ ట్వీట్​ ఆఫ్​ ది ఇయర్​'

​రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన ఓ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఆటగాడు నికోలస్​ పూరన్​ ఓ అద్భుతమైన క్యాచ్​ పట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోను దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్ ట్వీట్​ చేసి..​ పూరన్​పై ప్రశంసలు కురిపించారు. దీనికి రెండు లక్షలకు పైగా లైక్స్​, 23వేలకు పైగా రీట్వీట్స్​ వచ్చాయి. ఈ ట్వీట్​ను 'గోల్డెన్​ ట్వీట్​ ఆఫ్​ ది ఇయర్'​గా ప్రకటించింది ట్విట్టర్​.

ముంబయి ఇండియన్స్​ హవా​

ట్విట్టర్​ హ్యాష్​ట్యాగ్​ సెక్షన్​లో ముంబయి ఇండియన్స్ దుమ్మురేపింది. రోహిత్​ సేన.. చెన్నై సూపర్​ కింగ్స్​తో​ ఆడిన మ్యాచ్​లే ఎక్కువ హ్యాష్​ట్యాగ్​లతో ట్రెండ్​ అయ్యాయి. ఆ తర్వాత సన్​రైజర్స్ హైదరాబాద్​తో ఆడిన పోరులు ​రెండో స్థానంలో నిలవగా.. దిల్లీ క్యాపిటల్స్​తో ఆడిన మ్యాచ్​లు​ మూడో స్థానంలో నిలిచాయి.

దుబాయ్​ వేదికగా నవంబరు 10న జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్​పై గెలిచిన రోహిత్​ సేన.. ఐదోసారి టైటిల్​ను ముద్దాడింది.

mumbai indians
ముంబయి ఇండియ్స్​

ఇదీ చూడండి : 'విరాట్​ సెల్ఫీ మా కల నెరవేర్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.