ETV Bharat / sports

'పడిక్కల్​.. కోహ్లీ, డివిలియర్స్​ను మించిపోయాడు'

author img

By

Published : Nov 17, 2020, 11:27 PM IST

Padikkal
పడిక్కల్

ఈ ఐపీఎల్​లో బెంగళూరు జట్టు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​ ఆటతీరుకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. క్రికెట్​లో అతడికి మంచి భవిష్యత్​ ఉంటుందని అన్నాడు.

రాయల్​ ఛాలెంజర్​ బెంగళూరు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​కు క్రికెట్​లో మంచి భవిష్యత్​ ఉంటుందని అభిప్రాయపడ్డాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. ఈ ఏడాది ఐపీఎల్​లో అతడి ఆటకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పాడు. అభిమానుల అంచనాలను తారుమారు చేసేలా.. ఆర్సీబీలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్​, అరోన్​ ఫించ్​ లాంటి స్టార్​ ఆటగాళ్లను మించి బాగా ఆడాడని కొనియాడాడు. క్రీడాభిమానులు ఈ ముగ్గురు గురించి మాట్లాడుకోవడం మానేసి తన గురించి చెప్పుకునేంత గొప్ప ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. దీంతోపాటే ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్​ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచేలా ఆడాడని అన్నాడు.

పడిక్కల్​.. ఈ ఐపీఎల్​లో 124.80స్ట్రైక్​ రేట్​తో 473పరుగులు చేశాడు. ఐదు అర్ధ శతకాలు బాదాడు. తన అద్భుతమైన ఆటతో అందరీ దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చూడండి : అడిలైడ్​ టూ సిడ్నీ: కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల తరలింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.