ETV Bharat / sports

ఏకైక టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 12:10 PM IST

Updated : Dec 16, 2023, 3:05 PM IST

Ind w Vs Eng w Test : ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్​లో భారత్​ నెగ్గింది. ఏకంగా347 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది.

ind w vs eng w test
ind w vs eng w test

Ind w Vs Eng w Test : ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్​లో భారత్​ 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమ్ఇండియా మహిళలు మూడో రోజే మ్యాచ్​ను ముగించేశారు. భారత్ (428-10, 186-6 d) రెండు ఇన్నింగ్స్​ల్లో అదరగొట్టి, ప్రత్యర్థి ముందు 484 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బౌలర్లు దీప్తి శర్మ 4, పూజా వస్త్రకార్ 3, రాజేశ్వరీ గైక్వాడ్ 2, రేణుకా ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

సమష్ఠిగా రాణించిన అమ్మాయిలు : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా అమ్మాయిలు తొలి ఇన్నింగ్స్​లో, ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నారు. సుభా సతీశ్ (69), జెమిమా రోడ్రిగ్స్ (68), హర్మన్​ప్రీత్ కౌర్ (49), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67) అదరగొట్టారు. చివర్లో స్నేహ్ రానా (30) రాణించింది. దీంతో 104.3 ఓవర్లలో టీమ్ఇండియా 428 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, ఎక్లిస్టోన్ 3, చార్లి డీన్, కేట్ క్రాస్, నాట్ సీవర్ తలో వికెట్ పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్​లో, 483 పరుగుల ఆధిక్యం లభించిన తర్వాత టీమ్ఇండియా 186-6 వద్ద ఇన్నింగ్స్​​ డిక్లేర్ చేసింది.

దీప్తి @9 : స్పిన్​కు సహకరించిన పిచ్​పై టీమ్ఇండియా ఆల్​రౌండర్ దీప్తి శర్మ రెచ్చిపోయింది. తొలి ఇన్నింగ్స్​లో 5.3 ఓవర్లలోనే ఏకంగా 5 వికెట్లు నేలకూల్చింది. ఇందులో నాలుగు ఓవర్లను మెయిడెన్లుగా మలిచిందంటే పిచ్​ ఎంతలా టర్న్​ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో ఇన్నింగ్స్​లోనూ 4వికెట్లతో దీప్తి సత్తా చాటింది. ఈ మ్యాచ్​లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించింది.

వరల్డ్​ రికార్డ్ : తాజా విజయంతో టీమ్ఇండియా మహిళల జట్టు అరుదైన ఘనత సాధించింది. టెస్టుల్లో పరుగుల (347) పరంగా భారీ తేడాతో విజయం నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇదివరకు ఈ రికార్డు శ్రీలంక మహిళల జట్టుపై ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్​లో శ్రీలంక, పాకిస్థాన్​పై 309 పరుగుల తేడాతో నెగ్గింది. కాగా, భారత్ మహిళల జట్టు తాజాగా ఆ రికార్డును అధిగమించింది.

తొలి టీ20 ఇంగ్లాండ్​దే - పోరాడి ఓడిన టీమ్ఇండియా

భారత్ x ఇంగ్లాండ్​ - హర్మన్​ సేనకు పెద్ద సవాలే!

Last Updated : Dec 16, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.