Siraj Cricketer News: ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన స్టార్ పేసర్ సిరాజ్ అతితక్కువ కాలంలోనే మేటి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. టీమ్ఇండియా టెస్టు జట్టులో కీలక బౌలర్గా మారాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి ఆడుతున్న సిరాజ్.. తన తొలినాళ్లలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేసేవారని.. ఆయన రోజుకు ఇచ్చే రూ. 60తోనే ఉప్పల్ స్టేడియానికి వెళ్లి ట్రైనింగ్ తీసుకునేవాడినని తెలిపాడు.
"నేను అప్పట్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. మా నాన్న ఓ ఆటో డ్రైవర్. నాకు ప్లాటినా బైక్ ఉండేది. పెట్రోల్ ఖర్చులకని నాన్న ఇచ్చిన రూ.60తోనే ఉప్పల్ స్టేడియానికి వెళ్లి శిక్షణ తీసుకునే వాడిని. నేను ఐపీఎల్లోకి ఎంపికయ్యాక నా కష్టాలన్నీ తీరాయి. నాన్న ఆటో నడపడం ఆపేశారు. మేము కొత్త ఇల్లు తీసుకున్నాం. నాకు ఇంతకన్నా ఏం అక్కర్లేదు. ఐపీఎల్ నాకు పేరు తెచ్చింది.. సమాజంలోని వివిధ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నేర్పింది."
-మహమ్మద్ సిరాజ్, పేస్ బౌలర్
విరాట్ నుంచి సర్ప్రైజ్..
ఆర్సీబీ జట్టును తన ఇంటికి ఆహ్వానించినప్పుడు విరాట్ సర్ప్రైజ్ ఇచ్చాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. "నేను ఓసారి ఆర్సీబీ జట్టులోని వారందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నేను హోటల్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లిపోయాను. కోహ్లీకి ఫోన్ చేస్తే ఆరోగ్యం బాలేదు రాలేనని చెప్పాడు. కానీ ఆ తర్వాత అందరితో పాటు తను కూడా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. అది నా జీవితంలో బెస్ట్ సర్ప్రైజ్" అంటూ విరాట్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
ఇదీ చూడండి : "కోహ్లీ.. పాక్లో సెంచరీ చేస్తే చూడాలని ఉంది"